మనిషిలో మరో మొహం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
హైదరాబాద్లోని ఒక కాలేజీలో రవి, వాసు, మురళి, అనీష్, కళ్యాణ్ అనే ఐదుగురు స్నేహితులు బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. రవి బాగా చదివే మంచి విద్యార్థి. మిగతా నలుగురూ చదువు కంటే సినిమాలు, కబుర్లతోనే ఎక్కువ కాలం గడిపేవాళ్ళు.
ఫైనల్ ఇయర్ పరీక్షల సమయంలో అందరూ కలిసి రవి ఇంటికి చదువుకోవడానికి వచ్చారు. రవి వాళ్లకు చదువు చెబుదామనుకున్నా, ఆ నలుగురూ అనవసర కబుర్లతో రవి చదువును పాడుచేశారు.
చదువు పూర్తయిన తర్వాత,
"ఎవరికి ఉద్యోగం వచ్చినా సరే, అందరం ఒకరికొకరు సహాయం చేసుకుందాం" అని అందరూ కలిసి ఒక మాటిచ్చుకున్నారు.
కొన్ని రోజులకు బీటెక్ అయిపోయింది.
అనీష్ తన బంధువులు మరియు రూమ్మేట్స్ ద్వారా ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు.
వాసు ఒక అమ్మాయి సహాయంతో మంచి జాబ్ కొట్టాడు.
కళ్యాణ్ అమెరికా వెళ్లిపోయాడు.
మురళి తన తండ్రి పలుకుబడితో పెద్ద ఉద్యోగంలో చేరాడు.
కానీ రవి పరిస్థితి చాలా వేరుగా ఉంది. రవికి బయట లోకంతో పెద్దగా పరిచయాలు లేవు.
ఇంటి బాధ్యతలు అన్నీ రవి మీదే పడ్డాయి. ఉద్యోగం రాక రవి చాలా ఇబ్బంది పడ్డాడు.
మొదట్లో ట్యూషన్లు చెప్పాడు, అది కూడా పోయింది.
చివరికి చదువుకు సంబంధం లేని ఒక చిన్న నైట్ జాబ్ చేస్తూ ఎలాగోలా బతుకు బండి లాగుతున్నాడు.
ఒక రోజు రాత్రి రవి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లే దారిలో కాస్త అలసటగా అనిపించి రోడ్డు పక్కనే ఉన్న ఒక చిన్న హోటల్కి టీ తాగుదామని వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా బీటెక్ రోజుల్లో తనతో పాటు చదివిన మరో స్నేహితుడు శ్రీను కనిపించాడు. రవిని చూసి శ్రీను ఆప్యాయంగా పలకరించాడు.
ఇద్దరూ కలిసి ఒక టేబుల్ వద్ద కూర్చుని టీ తాగుతూ పాత విషయాలు మాట్లాడుకుంటూ తమ కష్టసుఖాలు పంచుకున్నారు.
ఆ సమయంలో రవి తన స్నేహితుల గురించి చెప్తూ,
"నా నలుగురు ఫ్రెండ్స్ అనీష్, వాసు, కళ్యాణ్, మురళి ఎవరికి వారు సెటిల్ అయ్యారులే కానీ, పాపం వాళ్లకు కూడా నాలానే ఉద్యోగాలు రావడానికి చాలా కష్టపడి ఉంటారు" అని అమాయకంగా అన్నాడు.
అది విని శ్రీను కాస్త గంభీరంగా నవ్వి, అసలు నిజం బయటపెట్టాడు.
"రవి, నువ్వు ఇంకా ఆ నలుగురి గురించే ఆలోచిస్తున్నావా? వాళ్ళు ఎలాంటివారో నీకు అసలు తెలియదు. వాళ్ళు కావాలనే నిన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. అనీష్, వాసు, మురళి, కళ్యాణ్ నలుగురూ ఒకరికొకరు రహస్యంగా గ్రూప్ లాగా ఏర్పడి సహాయం చేసుకున్నారు. నీకు మాత్రం కావాలనే దూరంగా పెట్టి, ఏ సహాయం చేయకూడదని ముందే నిర్ణయించుకున్నారు. నువ్వు వాళ్ల కోసం పడిన తపనంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది" అన్నాడు.
ఆ మాటలు విన్న రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
తాను ప్రాణంగా నమ్మిన స్నేహితులే తన వెన్నుపోటు పొడిచారనే నిజం తెలిసి రవి గుండె పగిలిపోయింది.
కళ్లలో నీళ్లు తిరుగుతుండగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
జీవితంలో ఎవరినైనా గుడ్డిగా నమ్మకూడదని, స్నేహితులను ఎంచుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ రోజు రవికి ఆ తెల్లవారుజామున ఒక చేదు నిజం ద్వారా అర్థమయింది.
~!~~~~~~~~~~~~~~~~~~~~~
telugu short story
No comments:
Post a Comment