Patha vaidyam
////_పాత వైద్యం //// కథ ///
పరంధామయ్య ఒకసారి చిన్న పని మీద తన ఊరు బయలుదేరాడు .అక్కడ తన తమ్ముడు రఘురామయ్య ని కలిశాడు. ఇద్దరూ భోజనం ముగించుకుని ఊరంతా ఒకసారి తిరిగి వద్దామని బయల్దేరారు దారిలో వారికి గ్రామ వైద్యుడు కాంతయ్య ఏదో ఆకులు అలములు నూరుతూ కనిపించాడు.
రఘురామయ్య "ఏం కాంతయ్య బాగున్నావా "అని పలకరించాడు
"ఎవరు మీ అన్నయ్యా... ఏమయ్యా పరంధామయ్య బాగున్నావా " అని కాంతయ్య తన ఇంట్లోకి ఆహ్వానించాడు
పరంధామయ్య వయసు 50 పైన ఉంటుంది రఘురామయ్య వయసు 40 పైనే ఉంటుంది.
ఇద్దరూ కా0తయ్య ఇంట్లో కూర్చున్నారు వారి ఎదురుగా కాంతయ్య కూర్చున్నాడు .
కుశలప్రశ్నలు అయిన తర్వాత
"ఏది ఓ సారి నీ చెయ్యి ఇవ్వు" అన్నాడు కా0తయ్య పరంధామయ్యని
"ఏంటి జాతకాలు కూడా చెప్తావా" అన్నాడు పరంధామయ్య
చెయ్యి పట్టుకుని నాడీ చూస్తూనే కాంతయ్య
" నీకు గుండెపోటుకు ...ఏదన్నా మందు ఇవ్వమంటావా"
ఆ ప్రశ్నకు పరంధామయ్య ఉలిక్కిపడ్డాడు
"నాకు గుండె నొప్పి సమస్య ఏమీ లేదు ఎందుకలా అడుగుతున్నావు " అడిగాడు కాంతయ్య ని
" లేకపోతే లేకపోయింది లే నేను మందు ఇస్తాను వేసుకో ఈ జబ్బు రాకుండా ఉంటుంది " అని చెప్పి అతని చేతుల్లో ఒక మూలిక చేతిలో పెట్టాడు
మారుమాట్లాడకుండా ఇద్దరూ కాంతికి సెలవు తీసుకుని తమ దారిన బయటకు వచ్చారు
పరంధామయ్య ఆలోచన గ్రహించిన రఘురామయ్య
" నీ ఆలోచన ఏంటో నాకు అర్థమైంది నీకు గుండెపోటు సమస్య ఉందో లేదో అనే కదా ఒక పని చెయ్ ఇంటికి వెళ్లి పరీక్షలు చేయించుకుని నీ ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి చెప్పమని చెప్పు " అన్నాడు రఘురామయ్య
అలాగే అని తల ఊపి సిటీకి వెళ్లి ఆ మరుసటి రోజే పరంధామయ్య ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లి తన హెల్త్ ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాడు..
దానికి ఆ కార్డియాలజిస్ట్
"దాందేముంది ఇప్పుడే హెల్త్ చెకప్ చేస్తా" నని
పొద్దున్నుంచి రాత్రి దాకా అని టెస్ట్ చేసి వాటి రిజల్ట్స్ కోసం రెండు రోజులు ఆగమని చెప్పి లాస్ట్ కి అవును మీకు కొలెస్ట్రాల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది మీరు ఫలానా ఆపరేషన్ చేయించుకుని దానికి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాడు
మళ్లీ ఊరు వచ్చి పరంధామయ్య కాంతయ్య ని కలిశాడు జరిగిందంతా చెప్పాడు
ఆ అయిదు లక్షల ఖర్చు అవసరం లేదు నేను ఇచ్చిన మూలిక వారం రోజుల పాటు వాడు నీకు కొలెస్ట్రాల్ తగ్గిపోయి నీకు ఏ హార్ట్ ఆపరేషన్ అవసరం ఉండదు అని చెప్పాడు ఆ విధంగానే వాడిన పరంధామయ్య మళ్లీ టెస్ట్ చేయించుకుంటే జీరో నార్మల్ కొలెస్ట్రాల్ ఉంది అని తేలింది
అన్ని వేలు పోసి చేసిన టెస్టు లకి మూడు రోజుల తర్వాత కూడా రిజల్ట్ తేల్చలేకపోయారు ...దానికి కూడా ఐదు లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ చేస్తే గాని నయం అవ్వదు అని చెప్పారు
పరంధామయ్య కి ఏమీ అర్థం కాలేదు ఒక పల్లెటూర్లో ఉండే డాక్టర్ ఏ అత్యాధునిక సదుపాయాలు లేకుండా కేవలం నాడి పట్టుకుని ఎలా చెప్పగలిగాడు అనేది అర్థం కాక మళ్ళీ రఘురామయ్య దగ్గరికి వెళ్ళాడు
ఇదే విషయం రఘురామయ్య దానికి కి రఘురామయ్య ఇలా అన్నాడు మీ సిటీ వాళ్ళు ప్రతి చిన్నదానికి మల్టీస్పెషల్టి హాస్పిటల్ పరిగెత్త్తుతారు
కానీ మనదేశంలో చాలా పల్లెటూర్లలో ఏ మల్టీస్పెషల్టి హాస్పిటల్ ఉండదు ఇలాంటి చిన్న డాక్టర్లు మాత్రమే ఉంటారు వాళ్ళు ఎం బి బి ఎస్ అయ్యుండొచ్చు కాకపోయి ఉండవచ్చు ఆర్.ఎం.పి అయ్యుండొచ్చు లేదా ఆయుర్వేదం అయి ఉండొచ్చు కానీ వీళ్ళు కేవలం కంటి చూపు తోటి లేదా నాడి పట్టుకొని మనిషి లోపల ఉన్న జబ్బు ఏమిటో చెప్పి వాళ్లకు కావలసిన వైద్యాన్ని లేదా మందుల్ని వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నారు . ఇంత జెసి వాళ్ళు తీసుకునే ఫీజు కేవలం పది రూపాయల 20 రూపాయలు మాత్రమే
నాకు తెలిసినంత వరకు ప్రతి ఊర్లో ఉండే గుడిలో దైవం ఉంటుందో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం మాకు ప్రత్యక్ష దైవాలు అని చెప్పాడు రఘురామయ్య
ఇది విన్న పరంధామయ్య మనసు చలించిపోయింది తను కూడా ఆ డాక్టర్ కి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు వాళ్ళ ఊర్లో పెద్ద హాస్పిటల్ కనిపించడానికి తన సమకూరుస్తున్నాడు రఘురామయ్య చాలా సంతోషించారు
హరీష్ 9902015746
#harishsworld
No comments:
Post a Comment