మరో జీవితం.. కథ
--------
✍️హరీష్ బాబు
---------
రాత్రి ఎనిమిది అయ్యింది.
గౌరీ , రాధాకృష్ణ ఇద్దరు భోజనానికి కూర్చున్నారు.
గిన్నెలు చుస్తే అన్నము, కూర ఖాళీ గా కనిపించాయి...
" అయ్యో చెప్పటం మరిచా అత్తయ్యా! కూరాలన్నీ అయిపోయాయి.. మీరు కొంచం పెరుగుతో కానిస్తారా ఇవాళ ... " అంటూ లోపలి నుంచి చెప్పింది కోడలు శారద
ఇద్దరు తెల్ల మొహాలు వేశారు..
"కొంచం ముందే చెపితే.. గుడ్డు అయినా చేసే దానిని కదా.." అనుకుంది గౌరి
ఈ నెల లో ఇలా చేయటం నాలుగో సారి..
ఇద్దరు ఖాళీ కడుపు తోటే పడుకున్నారు..
పొద్దునే వాకింగ్ నెపం తో బయటపడ్డారు..
దారిలో గౌరీ అంది
"ఏంటండీ మనకి ఈ ఖర్మ... మీ పెన్షన్ డబ్బు అంతా ఇద్దరికీ ఇచ్చేయద్దు అంటే విన్నారు కాదు..
ఉన్న ఇల్లు కూడా అమ్మించేసారు..
కనీసం ఒక మనసులో మాట ఏదయినా మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదు...ఆరునెల్లు ఆ కొడుకు దగ్గర.. ఆరునెలలు ఈ కొడుకు దగ్గరా ఉండటం ఇంకా నా వల్ల కావటం లేదండి.. "
"అదే నేను ఆలోచిస్తున్నా.." అంటూ ఏదో ద్యాస లో నడుస్తూ ఉన్నారు.. రాధాకృష్ణ
ఇంతలో ఎవరో వెనకాలనుంచి
"సార్.. " అంటూ పిలిచారు
"సార్ మీరు కృష్ణ సార్ కదా...నన్ను గుర్తు పట్టారా... నేను అన్వర్ ని సార్... గుంటూరులో మీ దగ్గరే చదువుకున్నాను.. " అన్నాడు
"ఓహ్ అవునా..చాలా కాలం అయింది కదా బాబు.. బాగున్నావా బాబు..
ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చావ్.. ఏమి చేస్తున్నావ్.." అడిగారు రాధాకృష్ణ గారు
"ఏమో సార్ అప్పుడు చదువు అబ్బలేదు.. టెన్త్ అయ్యాక హైదరాబాద్ వచ్చేసాను.. చిన్న హోటల్స్ లో సర్వర్ గా చేసాను.. ఇప్పుడు సొంతంగా ఏమైనా స్టార్ట్ చేదామని అనుకుంటున్నాను.. డబ్బు లేదు.. ఎలాగా అని ఆలోచిస్తున్నాను..
" మంచిది.. నాయనా చాలా మంచి ఆలోచన..నీ నెంబర్ ఇవ్వు సండే కాల్ చేస్తాను.. రాగలవా "
"తప్పకుండా సార్ ఉంటాను సార్ " అంటూ వెళ్లి పోయాడు..
ఆలోచన లో పడ్డాడు రాధాకృష్ణ.. గౌరి మౌనంగా చూస్తూ నడుస్తోంది...
......
గౌరి ఈయన వ్యవహారం అంతా గమనిస్తూ ఉంది
ఆదివారం రోజు సాయంత్రం.. రాధాకృష్ణ గారు అన్వర్ కి ఫోన్ చేసి ఎక్కడో కలవమన్నారు..
...
నెల తరువాత ఒక రోజు ప్రొద్దున..
పెద్ద కోడలు డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఉత్తరం చూసి షాక్ అయ్యింది...
" మేము ఇద్దరం ఇల్లు వదిలి వెళ్తున్నాం..
ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాం... మీ క్షేమం కోరే..
మీ అమ్మ నాన్న "
అని ఉత్తరం సారాంశం..
ఇది జరిగి నాలుగేళ్లు అయింది
....
అది విజయవాడ నేషనల్ హైవే...
హైదరాబాద్ కి 40 km దూరం లో
రోడ్ పక్కన ఒక పెద్ద బోర్డు..
" గౌరీ టిఫిన్స్ అండ్ ధాబా..
వెజ్ అండ్ నాన్ వెజ్ "
ఒక రోజు అటుగా వెళ్తున్న...
రాధాకృష్ణ పెద్దకొడుకు శ్రీధర్ ఫ్యామిలీ..
ఆ ధాబా లో ఆగి టిఫిన్ ఇర్డర్ చేశారు...
అక్కడ చూస్తే.. ఉన్నది అమ్మ నాన్న...
శ్రీధర్... రాధాకృష్ణ గారిని బిల్లింగ్ కౌంటర్ లో చూస్తూనే...
"నాన్న... ఎక్కడ వెళ్లి పోయారు నాన్నా ఇన్ని రోజులు.. మిమ్మల్ని వెదకని చోటంటూ లేదు.. రండి నాన్న ఇంటికి వెళదాం.. " అన్నాడు..
రాధాకృష్ణ గారు అతన్ని చూస్తూ...
" ఎవరు బాబు మీరు... ఎప్పుడు చూడలేదు...
ఏ టిఫిన్ కావాలో చెప్పండి.. పంపిస్తాను.. " అన్నాడు...
శ్రీధర్ కి మతి పోయింది..... అక్కడి నుంచి వెళ్లి పోయాడు...
ఆ మరుసటి రోజు... పొద్దున్నే నిద్ర లేచి తలుపు తీశారు.. రాధాకృష్ణ..
ఇంటి ముందు ఉన్న ఇద్దరు కొడుకులని చూసి షాక్ అయ్యాడు...
అలాగే వారిని పట్టించుకోకుండా... తన పని తాను చూసుకుని.. తొమ్మిది ఇంటికి.. భార్యతో కలిసి హోటల్ కు బయలుదేరుతున్నారు ..
ఇంతలో శ్రీధర్ మళ్ళీ నాన్నకి అడ్డు పడి
" ఏంటి నాన్న గుర్తు పట్టనట్టు చేస్తున్నారు "అని అడిగాడు
దానికి రాధాకృష్ణ గారు అన్నారు ..
" అయ్యో మేము ఇప్పుడు మర్చిపోయామా బాబు.. మీరు మమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు కదరా...
ఇపుడు కూడా మీరు ఎందుకు వచ్చారు అంటే ఇంత పెద్ద హోటల్ ఉంది.. ఎంత సంపాయించారో ఏమో మళ్ళీ పంచుకుందాం అనుకుని వచ్చారు అంతేనా ... ఇందులో పూచిక పుల్ల కూడా మాది కాదు లేదు ... అంతా అన్వర్ దే..
నిజంగా చెప్పండ్రా... ఒకవేళ ఇదే రోజు మమ్మల్ని మీరు ఏ గుడి దగ్గరో మేము బిచ్చమ్ ఎత్తుకుంటే.. నువ్వు ఆగే వాడివిరా... ఇలాగే ఇంటికి రమ్మని అనేవాడివా లేక గుర్తు పట్టనట్టు వెళ్లిపోయే వాడివా.. మమ్మల్ని గుర్తు పట్టలేదు అని తెగ బాధ పడిపోతున్నావు...పోండి రా.. పోయి పని చూసుకోండి.. "
"గౌరీ త్వరగా రా హోటల్ టైమ్ అవుతోంది.." అంటూ ఇంటికి తాళం వేసి ఇద్దరూ కారులో ఎక్కగా .. అన్వర్ హోటల్ వైపు కి కారుని పోనిచ్చాడు...
.. ( సమాప్తం )
. కథ
No comments:
Post a Comment